Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం

Eight killed in Rajasthans Sirohi as jeep on wrong side collides with truck

  • సిరోహి జిల్లా పిండ్వారాలో ఘోరం
  • మరో పదిమందికి తీవ్ర గాయాలు
  • పలువురి పరిస్థితి విషమం

రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ జీప్ లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్.. జీప్ ను రాంగ్ రూట్ లో తీసుకెళ్లడంతో ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణం తుఫాన్ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడా వున్నారని తెలిపారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని సిరోహి ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News