హైడ్రా నోటీసులపై సీఎం సోదరుడు ఏమన్నారంటే..?
--
2015లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ ఇల్లు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని వివరించారు. తాజాగా నోటీసులు అందుకున్న తర్వాతే తనకు విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు. ఫుల్ టాంక్ లెవెల్ లో ఉన్న మిగతా నిర్మాణాల విషయంలో వ్యవహరించిన మాదిరిగానే తన నివాసంపైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.