Botsa Satyanarayana: చీపురుపల్లిలో మంత్రి బొత్సకు తప్పని పరాజయం... కళా వెంకట్రావు జయభేరి

Minister Botsa lost to Kimidi Kala Venkatrao in Cheepurupalli

  • ఏపీ మంత్రులకు ఎదురుగాలి
  • 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓటమి
  • చీపురుపల్లిలో బొత్సపై విజయం సాధించిన కళా వెంకట్రావు
  • చీపురుపల్లిలో నోటాకు 2,855 ఓట్లు

ఏపీ మంత్రివర్గంలో ఒకరిద్దరు మినహా మిగతా అందరినీ ఓటమి పలకరించింది. జగన్ క్యాబినెట్ లో పురపాలకశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణకు పరాజయం ఎదురైంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ 11,971 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 

బొత్సపై టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కళా వెంకట్రావుకు 88,225 ఓట్లు వచ్చాయి. బొత్సకు 76,254 ఓట్లు పడ్డాయి. మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో నోటాకు 2,855 ఓట్లు పడడం గమనార్హం.

  • Loading...

More Telugu News