టీడీపీ-జనసేన సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వని అధికారులు
- బస్సులు కావాలంటూ టీడీపీ జనసేన నేతల విజ్ఞప్తి
- 100 బస్సులు కావాలని కోరినా ఒక్కటి కూడా కేటాయించని అధికారులు
- సభకు తగిన బందోబస్తు కూడా కల్పించలేదని ఆరోపణలు
కనీసం ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని టీడీపీ జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సొంత వాహనాల్లోనే సభకు బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన పార్టీలు.. తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను ఉమ్మడిగా నిర్వహించున్నాయి. ఈ ‘జెండా’ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అయితే, సభకు సెక్యూరిటీ కూడా తగినంత కల్పించలేదని ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.