'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' ఫస్టులుక్ రిలీజ్ .. 'ఆహా' నుంచి మరో వెబ్ సిరీస్!
- కొత్త వెబ్ సిరీస్ గా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'
- కార్పొరేట్ సంస్థ నేపథ్యంలో నడిచే కథ
- వినోదంతో కూడిన సందేశాన్ని అందించిన వెబ్ సిరీస్
- ప్రధానమైన పాత్రలో నటించిన హర్షిత్ రెడ్డి
జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి, ఈ రోజునే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. కామెడీ టచ్ తో ఈ వెబ్ సిరీస్ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.
అమలాపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ సంస్థలో చేరతాడు. అక్కడి మనుషులు .. వాళ్ల మనస్తత్వాలు .. జరిగే రాజకీయాలు చూసి ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు? అనేది కథ. హర్షిత్ రెడ్డి .. అనన్య శర్మ .. తేజస్వి మదివాడ ప్రధానమైన పాత్రలను పోషించారు.