రైలు ప్రమాదం సమయంలో ఈ వీడియోలా?.. కమెడియన్పై నెటిజన్ల ఫైర్
- సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలోని రైలు విన్యాసాలు షేర్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ
- ఒడిశా రైలు ప్రమాదం సమయంలో విన్యాసాల వీడియో షేర్ చేయడంపై నెటిజన్ల ఆగ్రహం
- వీడియోలు తొలగించి, క్షమాపణలు చెప్పిన కమెడియన్
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు. ఓ వైపు వందల సంఖ్యలో మరణిస్తే, వేలాది కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయిన సమయంలో ఇలాంటి విన్యాసాలు షేర్ చేయడం ఏమిటని నెటిజన్లు ఏకిపారేశారు. తన తప్పు తెలుసుకున్న రాహుల్ రామకృష్ణ వాటిని తొలగించాడు. అంతేకాదు, క్షమాపణ కూడా చెప్పాడు.
తాను చేసిన ట్వీట్ కు సారీ చెబుతున్నానని, ప్రామిస్.. తనకు ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియదని చెప్పాడు. తాను అర్ధరాత్రి నుండి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. తాను వార్తలు చూడలేదని, అందుకే ఈ తప్పు జరిగిందని, మరోసారి క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. ఆయన సారీ చెప్పడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు.