కోహ్లీ, జడేజా కూడా ఔట్.. ఇక ఆశలన్నీ తెలుగు క్రికెటర్ పైనే
- 135 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- రాహుల్, రోహిత్, పుజారా, శ్రేయస్, జడేజా, కోహ్లీ ఔట్
- లైయన్ కు నాలుగు, మర్ఫికి ఓ వికెట్
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (26) ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, తొలి సెషన్ లో విజృంభించిన లైయన్ కు ఇతర స్పిన్నర్లు టాడ్ మర్ఫి, కునేమన్ తోడయ్యారు. జడేజాను ఔట్ చేసిన మర్ఫి ఈ జోడీని విడదీశాడు. ఇక, అర్ధ సెంచరీకి చేరువైన కోహ్లీని కునెమన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు తోడు అశ్విన్, అక్షర్ పటేల్ రాణిస్తేనే భారత్ కోలుకోగలదు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది.