మంజునాథరెడ్డిది ఆత్మహత్యే.. పోస్టుమార్టంలో తేల్చిన పోలీసులు
- నిన్న సాయంత్రమే అంత్యక్రియలు పూర్తి
- ఒకరు మోసగించి ఆత్మహత్యకు పురికొల్పారంటూ కేసు
- మంజునాథరెడ్డి కంపెనీ భాగస్వామి సుఖవాసి చక్రధర్పై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి
మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వర్రెడ్డి ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మంజునాథరెడ్డిని ఒకరు మోసం చేసి ఆత్మహత్యకు పురికొల్పినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సహస్ర కంపెనీలో తన కుమారుడి భాగస్వామి అయిన రాయచోటికి చెందిన సుఖవాసి చక్రధర్పై మహేశ్వర్రెడ్డి ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి కారణం అతడేనన్నారు. చేసిన పనులకు సంబంధించి 4 బిల్లులు మంజూరైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇటీవల ఐదో బిల్లు మంజూరైనా డబ్బులు ఇవ్వలేదని, తాను పెట్టిన యంత్రాలకు కూడా డబ్బులు చెల్లించలేదని, అతడి వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.