వైసీపీకి ఈదర మోహన్ బాబు రాజీనామా.. బాలినేని నమ్మక ద్రోహమే కారణమని ఆరోపణ
- డీసీసీబీ చైర్మన్గా వ్యవహరించిన ఈదర
- 2017లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు
- 2018లో వైసీపీలో చేరిన వైనం
టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈదర మోహన్ బాబు... టీడీపీ హయాంలోనే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చైర్మన్గా వ్యవహరించారు. రాష్ట్రంలో 2017లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసిన ఈదర... 2018లో వైసీపీలో చేరారు. తాజాగా వైసీపీ నేతల వ్యవహార ధోరణి నచ్చక ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేశారు.