మహేశ్ మూవీ కోసం భారీ సెట్లు వేయిస్తున్న త్రివిక్రమ్!
- త్రివిక్రమ్ మూవీకి సన్నాహాలు
- మహేశ్ బాబుతో మూడో సినిమా
- టైటిల్ గా వినిపిస్తున్న 'పార్థు'
ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మూడో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కథ ఏదైనా అది కుటుంబాలు .. బంధాలు చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఆయన సెట్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. మహేశ్ మూవీ కోసం కూడా ఆయన భారీ సెట్లు వేయించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన డిజైన్స్ ను పరిశీలిస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.