వైసీపీకి అనుకూలంగానే ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ జరిగింది: టీడీపీ ఎమ్మెల్యే అనగాని
- అచ్చెన్న, రామానాయుడులపై ప్రివిలేజ్ కమిటీలో చర్చ
- ఇద్దరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
- ఏకపక్షంగానే సమావేశాన్ని ముగించారన్న అనగాని
సభా హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, కమిటీ ఛైర్మన్ లకు ఉంటుందని అనగాని చెప్పారు. టీడీపీ ఇచ్చిన నోటీసులను కమిటీ అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీకి ఉపయోగపడే విధంగానే సమావేశం జరిగిందని విమర్శించారు.