పీసీసీ చీఫ్ రేసులో నేనే ముందున్నా: కోమటిరెడ్డి
- నాకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తా
- ప్రజల పక్షాన పోరాటం చేస్తాం
- ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి
తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని చెప్పారు. తనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు భారంగా మారిందని... గ్రేటర్ ఎన్నికల ఫలితాన్ని చూసైనా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరదసాయం అందని వారందరికీ రూ. 10 వేల వంతున సాయాన్ని అందించాలని అన్నారు. లేనిపక్షంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పారు.