Dubbaka: దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బాబూమోహన్.. రఘునందన్‌రావును గెలిపించాలని పిలుపు

BJP Leader Babu Mohan campaign in Dubbaka

  • టీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందుతాయి
  • రఘునందన్‌రావుకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది
  • ఆయన గెలిస్తేనే దుబ్బాక ప్రజలకు న్యాయం

దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించాలని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ ప్రజలను కోరారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలపై రఘునందన్‌రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందుతాయని, దుబ్బాక కూడా అభివృద్ధి సాధించాలంటే రఘునందన్‌రావును గెలిపించాలని బాబూమోహన్ కోరారు.

Dubbaka
babu mohan
BJP
Raghunandan rao
  • Loading...

More Telugu News