ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్?
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ చిత్రం
- హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపిక
- రెహ్మాన్ కి భారీ పారితోషికం ఆఫర్
అందుకు తగ్గట్టుగానే మరిన్ని విశేషాలను ఈ చిత్రానికి జోడిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం కోసం భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసి రెహ్మాన్ ని తీసుకున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈచిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. సినిమా విస్తృతి దృష్ట్యా మిగతా పాత్రలకు కూడా పలు భాషల నుంచి ప్రముఖ నటులను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.