రెండోసారి ప్లాస్మా దానం చేసిన నటి జోయా మోరానీ
- ఇటీవల కరోనా నుంచి కోలుకున్న జోయా
- తొలిసారి ఆమె ప్లాస్మాతో కరోనా నుంచి కోలుకున్న రోగి
- జోయాను ప్రశంసించిన మంత్రి ఆదిత్య థాకరే
కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు జోయా పేర్కొన్నారు. రక్తదానం వల్ల ఇతరులకు సాయం చేసిన వారు అవుతారని వైద్యులు తనతో చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్లాస్మాను రెండోసారి దానం చేసిన జోయాను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ప్రశంసించారు. రక్తదానం చేయడానికి ధైర్యం, బలం అవసరమన్న థాకరే.. జోయాకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.