Ntr: ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్?

  • తెలుగు సినిమాలపై జాన్వీ ఆసక్తి 
  • జాన్వీతో సంప్రదింపులు 
  • పూజ హెగ్డేకి చోటు దొరికే ఛాన్స్
Trivikram Srinivas Movie

ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోంది. అందువలన ఈ సినిమాతో ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. ఒకవేళ జాన్వీ కపూర్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, పూజ హెగ్డేను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News