Chandrababu: ఎస్​ఈసీ రమేశ్​ కుమార్​ ను నియమించింది నేను కాదు: చంద్రబాబు

Chandrababau reacts on Jagan comments

  • రమేశ్ ని చంద్రబాబే నియమించుకున్నారని జగన్ ఆరోపణ
  • నాటి గవర్నర్ ప్రతిపాదన మేరకే ఈ నియామకం జరిగింది
  • నేను మాత్రం సీఆర్ బిశ్వను నియమించమని ప్రతిపాదించా

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నాడు చంద్రబాబు నియమించుకున్నారంటూ సీఎం జగన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ, రమేశ్ కుమార్ ను తాము నియమించలేదని స్పష్టం చేశారు. సీఆర్ బిశ్వను ఎస్ఈసీగా నియమించాలని నాడు తాను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ మాత్రం రమేశ్ కుమార్ ను ప్రతిపాదించారని, ఈ క్రమంలో ఎస్ఈసీగా ఆయన్ని నియమించారని వివరించారు.

  • Loading...

More Telugu News