అజిత్ కి విలన్ కోసం వెతుకులాట .. తెరపైకి ఇద్దరు తెలుగు హీరోల పేర్లు
- అజిత్ కథానాయకుడిగా 'వాలిమై'
- కథానాయికగా హుమా ఖురేషి
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
విలన్ పాత్ర కోసం తెలుగు నుంచి యంగ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగులో కార్తికేయ పేరు వినిపించింది. తాజాగా నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరికీ కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేసిన అనుభవం వుంది. అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరిలో విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.