ఇంటి కొనుగోలుదారులకు భారీ ఊరట.. బ్రోచర్లోని హామీలు నెరవేర్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు
- డీఎల్ఎఫ్ గురుగ్రామ్ ప్రాజెక్టు వివాదంపై కీలక వ్యాఖ్యలు
- బ్రోచర్లో చూపిన 24 మీటర్ల రోడ్డును నిర్మించకపోవడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం
- ఇది చిన్న మార్పు కాదని, చాలా కీలకమైనదని కోర్టు అభిప్రాయం
- హామీ మేరకు ప్రాజెక్టును మార్చకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రియల్ ఎస్టేట్ డెవలపర్లకు సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ప్రాజెక్టుల బ్రోచర్లలో, ప్రచార సామగ్రిలో ఇచ్చే హామీలను కేవలం మార్కెటింగ్ జిమ్మిక్కులుగా చూడటానికి వీల్లేదని, కొనుగోలుదారులకు చెప్పిన ప్రతి అంశాన్ని కచ్చితంగా నెరవేర్చాలని స్పష్టం చేసింది.
గురుగ్రామ్లోని సెక్టార్ 82Aలో డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ నిర్మించిన 'ది ప్రైమస్' రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో ఈ తీర్పు వెలువడింది. ప్రాజెక్టు బ్రోచర్లో చూపిన 24 మీటర్ల వెడల్పున్న రోడ్డును వాగ్దానం చేసినట్లు నిర్మించకపోవడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ మార్పు చిన్నది కాదని, చాలా కీలకమైనదని జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
కోర్టు ఆదేశాల మేరకు జరిగిన సీబీఐ ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 147 మీటర్ల పొడవున ఉండాల్సిన రోడ్డులో 52 మీటర్ల భాగాన్ని గ్రీన్ ప్యాచ్గా మార్చారు. మరో భాగాన్ని నివాసితులు, సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం వాడుతున్నారు. అంటే, బ్రోచర్లో చూపిన విధంగా రోడ్డు దాదాపుగా లేనట్లేనని నివేదిక తేల్చింది.
బ్రోచర్లలోని హామీలను చూసే ప్రజలు ఫ్లాట్లు కొంటారని, వాటికి అనుగుణంగానే ప్రాజెక్టులను నిర్మించి అందించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలోగా బ్రోచర్లో చెప్పినట్లుగా ప్రాజెక్టులో మార్పులు చేయకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని డీఎల్ఎఫ్ను హెచ్చరించింది.
2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, పలువురు కొనుగోలుదారులు ముందుగా జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇరు పక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి విచారణను అక్టోబర్ 12, 2026కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
గురుగ్రామ్లోని సెక్టార్ 82Aలో డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ నిర్మించిన 'ది ప్రైమస్' రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో ఈ తీర్పు వెలువడింది. ప్రాజెక్టు బ్రోచర్లో చూపిన 24 మీటర్ల వెడల్పున్న రోడ్డును వాగ్దానం చేసినట్లు నిర్మించకపోవడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ మార్పు చిన్నది కాదని, చాలా కీలకమైనదని జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
కోర్టు ఆదేశాల మేరకు జరిగిన సీబీఐ ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 147 మీటర్ల పొడవున ఉండాల్సిన రోడ్డులో 52 మీటర్ల భాగాన్ని గ్రీన్ ప్యాచ్గా మార్చారు. మరో భాగాన్ని నివాసితులు, సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం వాడుతున్నారు. అంటే, బ్రోచర్లో చూపిన విధంగా రోడ్డు దాదాపుగా లేనట్లేనని నివేదిక తేల్చింది.
బ్రోచర్లలోని హామీలను చూసే ప్రజలు ఫ్లాట్లు కొంటారని, వాటికి అనుగుణంగానే ప్రాజెక్టులను నిర్మించి అందించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలోగా బ్రోచర్లో చెప్పినట్లుగా ప్రాజెక్టులో మార్పులు చేయకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని డీఎల్ఎఫ్ను హెచ్చరించింది.
2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, పలువురు కొనుగోలుదారులు ముందుగా జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇరు పక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి విచారణను అక్టోబర్ 12, 2026కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.