నేపాల్ వరదల్లో అద్భుతం.. బురదలో 3 రోజులు.. ప్రాణాలతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి!

Nepal Floods Miracle 6 Year Old Girl Rescued Alive After 3 Days Under Mud
  • మూడు రోజుల తర్వాత శిథిలాల కింద ప్రాణాలతో బాలిక
  • రసూవా జిల్లాలో అద్భుతం చేసిన రెస్క్యూ బృందాలు
  • మెరుగైన చికిత్స కోసం చిన్నారిని ఖాట్మండుకు తరలింపు
నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల్లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. హిమాలయ దేశాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల కారణంగా 650 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత, రసూవా జిల్లాలో మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భోటే కోశి నదికి వచ్చిన వరదల వల్ల గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం శుక్రవారం గాలిస్తుండగా, శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన బృందాలు, బాలికను సురక్షితంగా బయటకు తీశాయి.

బుధవారం హిమానీనదం (గ్లేసియర్) కూలిపోవడంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కాగా, రక్షించిన బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు శనివారం ఖాట్మండుకు తరలించారు. ఈ ఘటనతో విషాదంలో కూరుకుపోయిన నేపాల్‌లో ఆశలు చిగురించాయి.
Advertisement
Nepal Floods
Rasuwa District
Six Year Old Girl Rescued
Nepal Flash Floods Survival
Bhote Koshi River
Armed Police Force Nepal

More Telugu News