సేవింగ్స్ ఖాతాలో నగదు జమ: రూ.10 లక్షలు దాటితే ఏమవుతుంది? ఐటీ నిబంధనలు ఇవే!
- ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు దాటితే బ్యాంకుల నుంచి ఐటీ శాఖకు సమాచారం
- డిపాజిట్ చేసినంత మాత్రాన పన్ను పడదు, కానీ ఆధారం చూపాలి
- రూ.50,000 పైబడిన డిపాజిట్కు పాన్ కార్డు తప్పనిసరి
- ఒకరి నుంచి రోజుకు రూ.2 లక్షల నగదు స్వీకరించడంపై నిషేధం
సాధారణంగా చాలామంది తమ వద్ద ఉన్న నగదును బ్యాంకులోని పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)లో జమ చేస్తుంటారు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు నగదు జమ చేయవచ్చనే దానిపై చాలామందికి స్పష్టత ఉండదు. ఈ నిబంధనలను విస్మరిస్తే ఆదాయ పన్ను (Income Tax) శాఖ నుంచి నోటీసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి నగదు లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రూ.10 లక్షల పరిమితి దాటితే ఏంటి పరిస్థితి?
ఒక వ్యక్తి తన సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేస్తే, ఆ సమాచారాన్ని సంబంధిత బ్యాంకు తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖకు నివేదిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసినా లేదా పలు దఫాలుగా జమ చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది.
అయితే, రూ.10 లక్షల పరిమితి దాటినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం నగదు జమ చేసినందుకు పన్నులు లేదా జరిమానాలు విధించరు. కానీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ డబ్బు మూలాన్ని (Source of Funds) గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆదాయ పన్ను రిటర్నుల (ITR)లో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. జీతం, వ్యాపార లాభాలు, ఆస్తుల అమ్మకం, అద్దె ఆదాయం వంటి చట్టబద్ధమైన మార్గాల ద్వారా వచ్చిన డబ్బు అయితే, నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించిన ఆధారాలు (శాలరీ స్లిప్స్, వ్యాపార పద్దులు, అగ్రిమెంట్లు) సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఇతర కీలక నగదు లావాదేవీల నిబంధనలు
పాన్ కార్డు తప్పనిసరి: బ్యాంకులో ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే పాన్ (PAN) కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే, ఫారం 60 సమర్పించాల్సి ఉంటుంది.
సెక్షన్ 269ST నిబంధన: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే వ్యక్తి నుంచి ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించడం చట్టరీత్యా నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, స్వీకరించిన మొత్తానికి సమానమైన జరిమానా విధించే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉంటుంది.
ఈ నిబంధన క్రింది వాటికి వర్తించదు:
ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీలు, పోస్టాఫీసు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకులు చేసే లావాదేవీలు.
సెక్షన్ 269SS పరిధిలోకి వచ్చే లావాదేవీలు.
కాబట్టి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలు జరిపేటప్పుడు Account Payee Cheque, Bank Draft లేదా RTGS/NEFT/UPI వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే చెల్లింపులు లేదా స్వీకరణలు జరపడం చట్టబద్ధం
నల్లధనాన్ని అరికట్టడం, పన్ను ఎగవేతను నిరోధించడం, లెక్కల్లో చూపని నగదు చలామణిని తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు సరైన పత్రాలను భద్రపరుచుకోవడం, బ్యాంక్ స్టేట్మెంట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడవచ్చు.
రూ.10 లక్షల పరిమితి దాటితే ఏంటి పరిస్థితి?
ఒక వ్యక్తి తన సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేస్తే, ఆ సమాచారాన్ని సంబంధిత బ్యాంకు తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖకు నివేదిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసినా లేదా పలు దఫాలుగా జమ చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది.
అయితే, రూ.10 లక్షల పరిమితి దాటినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం నగదు జమ చేసినందుకు పన్నులు లేదా జరిమానాలు విధించరు. కానీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ డబ్బు మూలాన్ని (Source of Funds) గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆదాయ పన్ను రిటర్నుల (ITR)లో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. జీతం, వ్యాపార లాభాలు, ఆస్తుల అమ్మకం, అద్దె ఆదాయం వంటి చట్టబద్ధమైన మార్గాల ద్వారా వచ్చిన డబ్బు అయితే, నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించిన ఆధారాలు (శాలరీ స్లిప్స్, వ్యాపార పద్దులు, అగ్రిమెంట్లు) సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఇతర కీలక నగదు లావాదేవీల నిబంధనలు
పాన్ కార్డు తప్పనిసరి: బ్యాంకులో ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే పాన్ (PAN) కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే, ఫారం 60 సమర్పించాల్సి ఉంటుంది.
సెక్షన్ 269ST నిబంధన: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే వ్యక్తి నుంచి ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించడం చట్టరీత్యా నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, స్వీకరించిన మొత్తానికి సమానమైన జరిమానా విధించే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉంటుంది.
ఈ నిబంధన క్రింది వాటికి వర్తించదు:
ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీలు, పోస్టాఫీసు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకులు చేసే లావాదేవీలు.
సెక్షన్ 269SS పరిధిలోకి వచ్చే లావాదేవీలు.
కాబట్టి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలు జరిపేటప్పుడు Account Payee Cheque, Bank Draft లేదా RTGS/NEFT/UPI వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే చెల్లింపులు లేదా స్వీకరణలు జరపడం చట్టబద్ధం
నల్లధనాన్ని అరికట్టడం, పన్ను ఎగవేతను నిరోధించడం, లెక్కల్లో చూపని నగదు చలామణిని తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు సరైన పత్రాలను భద్రపరుచుకోవడం, బ్యాంక్ స్టేట్మెంట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడవచ్చు.