కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్
- అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య
- తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమన్న కేసీ వేణుగోపాల్
- అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
తనతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రి పదవిని ఆశించారని వెల్లడించారు. అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందని, సతీశన్ ఎంపికపై సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. పార్టీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించిందని అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికైన సతీశన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.