విజయ్ మా పార్టీ మద్దతు కోరారు: ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన
- విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ల సమావేశం
- సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్
- విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తమిళనాడు యూనిట్దేనని స్పష్టీకరణ
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మద్దతు కావాలంటూ విజయ్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించారని తెలిపారు. అయితే విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు, నిర్ణయం తీసుకోవాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఒక పార్టీ నిర్ణయం తీసుకోవడానికి ముందు రాజకీయ వ్యూహం, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, తమిళనాడు పార్టీ ఇన్ఛార్జ్ గిరిష్ చోడంగర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ పైవిధంగా స్పందించారు.