మూసీ పునరుజ్జీవం... తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం
- సమావేశమైన సబ్ కమిటీ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రబాకర్
- మూసీ పునరుజ్జీవంపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం
- ఏప్రిల్ 15వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడిన సబ్ కమిటీ, సంబంధిత అధికారులతో ఈరోజు సమావేశమైంది. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏప్రిల్ 15వ తేదీ వరకు తమ అభిప్రాయలను, సూచనలను నేరుగా musirrdc@gmail.com కు మెయిల్ చేయవచ్చు.