మనవరాలి కోరిక.. కుటుంబంతో చిరంజీవిని కలిసిన బీజేపీ నేత
- ఆస్ట్రేలియాలో ఉంటున్న రామచందర్ రావు మనవరాలు ఐరా ఆశీష్
- షూటింగ్ స్పాట్లో మర్యాదపూర్వకంగా కలిసిన రామచందర్ రావు కుటుంబం
- చిరంజీవి విలువైన సమయం కేటాయించారన్న రామచందర్ రావు
చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతారను కూడా రామచందర్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. చిరంజీవితో జరిగిన సమావేశంలో సినిమా విశేషాలతో పాటు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు ఆలోచనలు పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి ఎంతో ఆప్యాయతతో, విలువైన సమయం కేటాయించారని రామచందర్ రావు అన్నారు. తమకు సమయం ఇచ్చినందుకు చిరంజీవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో జరిగిన ఈ కలయిక తమ కుటుంబానికి ఒక మరపురాని ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.