'తెలుసు కదా' టీజర్.. తన మార్క్ డైలాగులతో అదరగొట్టిన సిద్దు!
- ఆకట్టుకుంటున్న సిద్దు మార్క్ డైలాగులు
- అక్టోబర్ 17న సినిమా థియేటర్లలోకి
- దర్శకత్వం వహిస్తున్న నీరజ కోన
- హీరోయిన్లుగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా
టీజర్ విడుదల చేయడంతో సినిమా ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిద్దు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి, మరో ప్రముఖ నటి రాశి ఖన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.