ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి లభించని తక్షణ ఊరట
- లిక్కర్ కేసులో మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ కోరుతూ చెవిరెడ్డి పిటిషన్
- ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తి
- మధ్యంతర బెయిల్పై విచారణ రేపటికి వాయిదా
- రెగ్యులర్ బెయిల్పై సెప్టెంబర్ 2న విచారణ
ఈ పిటిషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించింది. వాదనలు ముగిసిన అనంతరం, మధ్యంతర బెయిల్పై విచారణను రేపటికి, రెగ్యులర్ బెయిల్పై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కోర్టు నిర్ణయంతో చెవిరెడ్డి బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల విధానంలో భారీగా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు జరిపిన విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కసిరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం వారంతా బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై విచారణలు కొనసాగుతున్నాయి.