బాలకృష్ణకు రాఖీ కట్టిన పురందేశ్వరి... వీడియో ఇదిగో!
- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోషల్ మీడియాలో పురందేశ్వరి భావోద్వేగ పోస్ట్
- అన్నదమ్ములు తనకు రక్షణ కవచంలాంటి వారని వ్యాఖ్య
- బాలయ్య ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్ష
రక్షాబంధన్ సందర్భంగా పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన రక్షాబంధన్. నా తమ్ముడి చేతికి రాఖీ కట్టి, అతను సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని, అతని కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను" అని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలోని ప్రతి దశలోనూ సోదరులు తనకు రక్షణ కవచంలా, మంచి స్నేహితుల్లా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు.
"మీరందరూ మంచి ఆరోగ్యంతో, మీ కలలను సాకారం చేసుకునే శక్తితో, ప్రతి అడుగులోనూ అపారమైన శ్రేయస్సుతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మనం కలిసి పంచుకున్న ప్రతి జ్ఞాపకం నాకు అమూల్యమైనది. భవిష్యత్తులో కూడా మన బంధం ఇలాగే నవ్వులతో, ప్రేమతో కొనసాగాలని ఆశిస్తున్నాను" అని పురందేశ్వరి తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.