సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చిరంజీవి
- చోరీకి వచ్చిన దుండగుడి చేతిలో సైఫ్ కు కత్తిపోట్లు
- సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కరీనా టీమ్ ప్రకటన
- దాడి విషయం తెలిసి కలత చెందానన్న మెగాస్టార్
సైఫ్ అలీఖాన్ భార్య, నటి కరీనా కపూర్ టీమ్ ఈ ఘటనపై స్పందించింది. సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బుధవారం రాత్రి సైఫ్, కరీనా నివాసంలో చోరీ యత్నం జరిగింది. దుండగుడి దాడిలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని కరీనా టీమ్ పేర్కొంది.