రామ్ పోతినేని-మహేష్బాబు.పి కాంబినేషన్ సినిమా ప్రారంభం
- రామ్ 22వ చిత్రం ప్రారంభం
- క్లాప్ కొట్టిన హను రాఘవపూడి
- రామ్ సరసన నాయికగా భాగ్యశ్రీ బోర్సే
రామ్ 22వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తోంది. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ నిచ్చారు. తొలిషాట్కు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర నిర్మాతలతో పాటు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని సంయుక్తంగా కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రామ్ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ఆయన ప్రారంభించారు.
యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.