కస్టోడియల్ టార్చర్ పై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు.. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు
- రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు
- ఏ3గా జగన్ పేరును పేర్కొన్న పోలీసులు
- ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు
2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని... తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు.