మీ రాజకీయాలు మార్చుకోకుంటే క్రికెట్ టీం.. వాలీబాల్ టీం అవుతుంది! జగన్కు మంత్రి గొట్టిపాటి హెచ్చరిక
- జగన్ను జనం పాతాళానికి తొక్కేసినా బుద్ది మార్చుకోలేదన్న మంత్రి
- అర్హత లేకున్నా చంద్రబాబు ఆదేశంతోనే అసెంబ్లీలో గౌరవం లభించిందన్న రవికుమార్
- జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని ఆగ్రహం
జగన్ను ప్రజలు పాతాళానికి తొక్కేశారని, అయినప్పటికీ చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తుచేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.