అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం.. ఎందుకంటే..!
- ఆరోగ్య కారణాలవల్లేనని బీజేపీ వర్గాల వెల్లడి
- ఈ నెలాఖరులో బాల రాముడిని దర్శించుకుంటారని వివరణ
- మురళీ మనోహర్ జోషి హాజరు కూడా సందేహమే
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వ హిందూ పరిషత్ గతేడాది డిసెంబర్ లోనే ఆహ్వానించింది. ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వ హిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదాపు 60 దేశాల్లో వీహెచ్ పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.