కందుల జాహ్నవి మరణంపై స్పందించిన ప్రియాంకా చోప్రా
- ఆలస్యంగా వెలుగు చూడడం పట్ల ఆవేదన వ్యక్తీకరణ
- జీవితానికి ఎవరూ విలువ కట్టరాదంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
- దీనిపై విచారణ చేయాలని ఇప్పటికే డిమాండ్ చేసిన భారత్
దీనిపై ప్రియాంకా చోప్రా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ‘‘తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడం బాధాకరం. జీవితం అంటే జీవితమే. దానికి ఎవరూ విలువ కట్టకూడదు’’అని ప్రియాంక తన అభిప్రాయాలను పంచుకుంది. జాహ్నవి మరణంపై పోలీసు అధికారుల సంభాషణలు వెలుగు చూడడంతో, దీనిపై విచారణ చేయాలని భారత్ డిమాండ్ కూడా చేసింది. దీంతో ఆమె మరణాన్ని ఉద్దేశించి నవ్వలేదంటూ సదరు పోలీసు అధికారి తరఫున అక్కడి ఆఫీసర్స్ గిల్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది.