గజరాజు 'బలరామ' మృతి పట్ల ప్రధాని మోదీ విచారం
- మైసూరులో దసరా ఉత్సవాల్లో కనిపించే ఏనుగు బలరామ
- గత కొన్నిరోజులుగా అనారోగ్యం
- భీమనకట్టె క్యాంపులో కన్నుమూత
- నేడు అంత్యక్రియలు
మైసూరు దసరా ఉత్సవాల్లో ఎన్నో ఏళ్లగా గజరాజు బలరామ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మోసే ఏనుగుగా బలరామకు ప్రజల్లో గుర్తింపు ఉందని వెల్లడించారు. ఎంతోమంది ఈ ఏనుగును అభిమానించేవారని తెలిపారు. ఇప్పుడా ఏనుగు కన్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కన్నడ భాషలో ట్వీట్ చేశారు.
గజరాజు బలరామ వయసు 65 ఏళ్లు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆదివారం నాడు నాగరహోళె పులుల అభయారణ్యం వద్ద భీమనకట్టె క్యాంపులో తుదిశ్వాస విడిచింది. ఇవాళ సకల లాంచనాలతో ఆ వృద్ధ ఏనుగు అంత్యక్రియలు నిర్వహించారు.
బలరామ కొన్నిరోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని, దాంతో ఆహారం, నీరు సరిగా తీసుకోలేపోయిందని అధికారులు తెలిపారు