చంచల్ గూడ జైల్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత
- వివేకా రెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి
- 14 రోజుల రిమాండ్ విధించిన సీబీఐ న్యాయమూర్తి
- ఈ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల విచారణపై సందిగ్ధత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భారతి మేనమామ అయిన భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివెందులలో అదుపులోకి తీసుకున్న భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.