హృదయాలను గెలుచుకున్న సృజనాత్మక ప్రతిభావంతుడు.. సతీష్: ప్రధాని మోదీ
- బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మరణంపై దిగ్భ్రాంతి
- ఆయన సినిమాలు వినోదాన్ని పంచుతూనే ఉంటాయన్న ప్రధాని
- కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి వ్యక్తీకరణ
గుండె పోటుతో బుధవారం అర్ధరాత్రి సతీష్ కౌశిక్ మరణించడం తెలిసిందే. అంత్యక్రియలు నేటి సాయంత్రం ముంబైలోని వెర్సోవా శ్మశాన వాటికలో జరుగుతాయి. ఢిల్లీ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ముంబైకి తరలించే సరికి మధ్యాహ్నం 3 గంటలు అవుతుందని భావిస్తున్నారు. అంత్యక్రియలు సాయంత్రం 5-6 గంటల మధ్యలో జరగొచ్చని తెలుస్తోంది.