మూడు రాజధానులే మా ప్రభుత్వ విధానం: బొత్స
- రాజధానిపై ప్రభుత్వ వైఖరి ఇదేనంటూ బొత్స వ్యాఖ్యలు
- అసెంబ్లీ సాక్షిగా ఇదే చెప్పామని వెల్లడి
- నాడు సీఎం జగన్, బుగ్గన చెప్పిదానికి తాము మద్దతిచ్చామని వివరణ
అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు. ఇది ప్రభుత్వ నిర్ణయం అని, ఇకపైనా ఇదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక, చంద్రబాబు హోల్ సేల్ గా అవినీతి చేశాడు కాబట్టే ప్రజలు హోల్ సేల్ గా ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. హోల్ సేల్ ఎవరో, రిటైల్ ఎవరో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పట్టించుకోనవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.