అమరావతిలో వర్షపు నీటిలోనే విట్, ఎస్ఆర్ఎం వర్సిటీలను సందర్శించిన సోము వీర్రాజు
- వర్షపు నీటితో నిండిపోయిన అమరావతి రోడ్లు
- అమరావతి పరిధిలోని విద్యా సంస్థల పరిశీలనకు వెళ్లిన వీర్రాజు
- వర్షపు నీటిలో పాట్లు పడుతూ ముందుకు సాగిన వైనం
- రాజధానిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై వీర్రాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన కారణంగానే అమరావతిలో ఈ విద్యా సంస్థలు తమ క్యాంపస్లను ఏర్పాటు చేశాయన్నారు. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దిగ్గజ వర్సిటీలకు వెళ్లేందుకు కూడా వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ధ్వజమెత్తారు.