అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
- దాసోజు లాంటి మేధావిని వెళ్లగొడుతున్నారన్న వెంకట్ రెడ్డి
- తననూ వెళ్లగొట్టే యత్నాలు చేస్తున్నారని ఆవేదన
- మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలుసన్న ఎంపీ
దాసోజు శ్రావణ్ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని, తనను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని ఆయన అన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకర్గ పరిధిలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన వెంకట్ రెడ్డి... చెరుకు సుధాకర్ కాంగ్రెస్లో చేర్చుకుంటున్న విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.