తెలంగాణలో శాంతి భద్రతలపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న రేణుక
- పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శ
- సెంట్రల్ ఫోర్స్ను తెలంగాణకు పంపాలంటూ సూచన
- అమిత్ షా తెలంగాణకు వచ్చి శాంతిభద్రతలను కంట్రోల్ చేయాలన్న కాంగ్రెస్ నేత
ఈ సందర్భంగా రేణుకా చౌదరి స్పందిస్తూ... "తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. రాష్ట్రంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. మంచి పోలీసులను కూడా పనిచేయనివ్వడం లేదు. సెంట్రల్ ఫోర్స్ను పంపాలి. అమిత్ షా ఢిల్లీలో కూర్చోవడం సరికాదు. తెలంగాణ వచ్చి శాంతి భద్రతలను కంట్రోల్ చేయాలి" అంటూ వ్యాఖ్యానించారు.