మీరు అందించిన విరాళానికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాం: బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రిలో అమృత సేవ
- వారానికి మూడుసార్లు ఉచితంగా ఆహారం
- రూ.14.40 లక్షలు విరాళం అందించిన రుద్రరాజు శ్రీరామరాజు
- సోషల్ మీడియా ద్వారా స్పందించిన బాలకృష్ణ
అవసరంలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడే అన్నదాన కార్యక్రమం అని, ఈ అమృతసేవ పథకానికి విరాళం అందించినందుకు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేమని తెలిపారు. "రుద్రరాజు శ్రీరామరాజు గారూ, మీరు అందించిన ఈ విరాళానికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాం" అని పేర్కొన్నారు. ''నేను ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుండడానికి మీవంటి వారి దాతృత్వమే ఆసరాగా నిలుస్తోంది. మీ విలువైన ఔదార్యం పట్ల మేమెంతో రుణపడి ఉంటాం" అని బాలకృష్ణ ఫేస్ బుక్ లో వివరించారు.