అందరికీ పూర్తి అవగాహన వచ్చింది... కరోనాను కట్టడి చేయడం సాధ్యమే: కేంద్ర ఆరోగ్య మంత్రి
- కరోనాపై అవగాహన లేని సమయంలోనే దాన్ని ఎదుర్కొన్నాం
- కానీ కరోనా పట్ల తేలిక భావం వద్దు
- రెమ్ డెసివిర్ ను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం
రెమ్ డెసివిర్ ఔషధం కొరత ఉన్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆయా ఫార్మా కంపెనీలను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఈ ఔషధాన్ని ఎవరైనా బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని... ఈ మేరకు ఇప్పటికే ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.