ఒప్పిస్తాం కానీ.. వెనక్కి తగ్గబోం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
- సీఏఏ అమలు విషయంలో వెనక్కి తగ్గబోం
- వారికి పౌరసత్వం ఎందుకివ్వకూడదో చెప్పాలని డిమాండ్
- నిద్ర నటిస్తున్న వారిని లేపడం కష్టమని వ్యాఖ్య
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లలో మతపరమైన హింసకు గురై మన దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ విలక్షణమే అన్ని మతాల కలయిక అని పేర్కొన్న రవిశంకర్ ప్రసాద్.. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు కానీ, నటించేవారిని లేపడం ఎవరి తరమూ కాదని సీఏఏను వ్యతిరేకించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.