బెంగళూరులో బాలభీముడు పుట్టాడు... బరువు 5.9 కిలోలు!
- బెంగళూరులో స్థిరపడిన డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన దంపతులు
- నెలలు నిండడంతో వైద్యపరీక్షలు
- మొదట కవలలుగా భావించిన వైద్యులు
అయితే, ప్రసవం తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు ఒక్క మగశిశువు మాత్రమే జన్మించాడు. అయితే అసాధారణ రీతిలో 5.9 కిలోల బరువున్నాడు. సాధారణంగా అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువులు 3 కేజీలవరకు బరువు ఉంటారు. ఈ బాలభీముడు మాత్రం ఐదు కేజీలకు పైగా బరువు తూగి అందరినీ విస్మయానికి గురిచేశాడు. యోగేశ్, సరస్వతి దంపతులకు ఇప్పటికే ఓ బిడ్డ ఉండగా, 14 ఏళ్ల తర్వాత ఇలా రెండో బిడ్డకు జన్మనిచ్చారు.