సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరిట నాలుగు ఓట్లు ఉన్నాయంటూ ఈసీకి ఫిర్యాదు
- మూడు రాష్ట్రాల్లో ఓట్లున్నాయి
- చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
- ఈసీని కలిసిన బీజేపీ నేత గిరీష్ కుమార్
అయితే, అదను చూసి రంగంలోకి దిగిన బీజేపీ కార్యకర్తలు ప్రకాశ్ రాజ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లున్నాయంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ కర్ణాటక విభాగం కార్యవర్గ సభ్యుడు గిరీష్ కుమార్ ఈ మేరకు ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ రాజ్ కు తమిళనాడులో 2, తెలంగాణలో 1, బెంగళూరు శాంతి నగర్ లో ఒక ఓటు ఉన్నట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, కానీ ప్రకాశ్ రాజ్ ఏకంగా 4 ఓట్లు కలిగి ఉన్నారని గిరీష్ కుమార్ తెలిపారు.