ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అవుతాడని వ్యాఖ్య
- కేసీఆర్, రామచందర్ రావులకు అలా చెప్పే దమ్ముందా అని నిలదీత
- బీజేపీ నాయకులు బీసీలకు వ్యతిరేకులు అని విమర్శ
బీజేపీ నాయకులు బీసీ వ్యతిరేకులు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం డిక్లరేషన్ ప్రకటించి చట్టం చేసిందని అన్నారు. ప్రభుత్వం అందరికీ సన్నబియ్యం ఇస్తోందని, ఇది చారిత్రాత్మకమని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బియ్యం దోపిడీ జరిగిందని ఆరోపించారు.