మైత్రివనం ఆదిత్య ఎన్క్లేవ్లో అగ్ని ప్రమాదం... తప్పిన ముప్పు
- రాందేవ్ ఇన్ఫోటెక్, శివమ్ టెక్నాలజీ దుకాణాల్లో మంటలు
- సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, పోలీసులు
- ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది హుటాహుటిన మైత్రివనంకు తరలి వచ్చారు.
గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు వరకు వ్యాపించడంతో భవనాన్ని ఖాళీ చేయించారు.