నిజామాబాద్లో బీజేపీ తప్పుకుంది కదా: కరీంనగర్ మేయర్ పదవిపై పొన్నం ప్రభాకర్
- నిజామాబాద్లో తప్పుకుంటున్నట్లు ధర్మపురి అరవింద్ చెప్పారన్న మంత్రి
- కరీంనగర్లో మెజారిటీ లేకుండా పదవి ఎలా దక్కించుకుంటారని ప్రశ్న
- కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ను ఎన్నుకుంటారన్న మంత్రి
ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్లో మేయర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మపురి అరవింద్ ప్రకటించారని గుర్తు చేశారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఎంపీ తెలిపారని అన్నారు. కరీంనగర్లో మెజారిటీ లేకుండానే మేయర్ పదవి దక్కించుకుంటామని బండి సంజయ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ను ఎన్నుకుంటారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అభివృద్ధికి సహకరిస్తామని, అందరినీ కలుపుకుని మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. మేయర్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తామూ అదేవిధంగా చేస్తున్నామని అన్నారు. మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం క్యాంపు రాజకీయాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.