చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఆసక్తికర పోస్ట్!
- సినీ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భేటీ
- చిరంజీవి తనకెంతో స్ఫూర్తి అని, టీనేజ్లోనే ఆయనతో సినిమా చేయాలనుకున్నానని వెల్లడి
- కలలను వెంబడిస్తే విజయం తథ్యమని చిరంజీవిని చూసే నమ్మానన్న శేఖర్ కమ్ముల
"నేను టీనేజీలో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. అప్పుడే, 'ఈయనతో సినిమా చేయాలి' అనే బలమైన కోరిక నాలో కలిగింది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మా బృందం ఒక వేడుక చేద్దామనుకోగానే నాకు వెంటనే గుర్తొచ్చిన వ్యక్తి చిరంజీవి గారే. కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి ఆయన.
కలలను నమ్మి, వాటిని వెంబడిస్తే విజయం తప్పకుండా వరిస్తుందనే నమ్మకాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి ఆయన. నా ఈ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఆయన సమక్షంలోనే జరుపుకోవాలనిపించింది. ఈ క్షణంలోనే కాదు.. నా టీనేజీ రోజుల నుంచి చిరంజీవి నా కళ్ల ముందు ఇలాగే ఉన్నారు" అంటూ శేఖర్ కమ్ముల తన పోస్ట్లో రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.